ఒక్కోసారి సొంత అమ్మలు జీవిoచిలేనివారిని గురించి దీర్ఘంగా ఆలోచిస్తే,ప్రేమాభిమానాలను
పంచడానికి స్వంత పిల్లలేకానక్కర్లేదని చెప్పగలిగిన వ్యక్తుల్లో మా మహలక్షమ్మ ఆమ్మ[మా పెదనాన్నగారి భార్య] మొదటివరుసలోకొచ్చి కూర్చుంటుంది.తన మరది పిల్లలమైన మమ్ములలను
కడుపులో పెట్టి చూసుకునేది అని చెప్పడంలో సందేహమేమీ లేదు. ఇప్పటిలా గ్యాస్ స్టౌవ్లూ లేవు
కుక్కర్ల ఊసూ తెలియదు.మాఊహకు తెలిసిందల్లా పొట్టుపొయ్యిలూ, కట్టెలపొయ్యిలూ. బొగ్గులకుంపట్లు కూడా ఇంకా ప్రచారంలోకి రాని రోజులు. వండనలయదు వేవురు వచ్చెనేని అన్నరీతిగా రోజూ
అయిదారుగురు తక్కువకాకుండా [ఇంత్ళో పిల్లలతోసహా ఉన్న పదిమందీకాక] ఉంటుండేవారు.
కర్ణం గారిల్లు కదా యే అదికారిఒచ్చినా ,కులంతో పరిమితంగాకుండా భోజనానికి యేర్పాట్లు జరిగేవి. ఇదిగాక నాలుగు బర్రెల పాడి ఎప్పుడూ రెండు పాడిగానూ రెండు సూడిగానూ ఉంటుండేవి.ఆవులూ ఉండేవి వాటిని మేపుతామని తీసుకెళ్ళిన వాళ్ళు కొండమీద దొర్లిపడ్డాయని చెప్పి అమ్ముకునేవారు,అ0దుకని వాటినిపోషించే వసతిలేక అమ్మేసారు. ఇది గాక పొలంపనులు ఉన్నరోజుల్లో ఒకల్లో ఇఫ్ద్దరికో చద్దిమూఅలాగా అన్నం పంపాల్సి వుండేది. మాపెదనాన్నగారు పోయాక[1985లో]
ఆవిడ మాదగారకొచ్చి గుంటూరులోనే వుండేది. మహ్యాహ్నం రెండుగంటలకు అందరూ తిన్నరనుకున్నాక ఆమె ఎంగిలిపడేది. పూజాపునస్కారాలూ మెండు.ఒంటిగంటదాకా పూజలు చేసుకునేది.
సాయంత్రం ఇరుగుపొరుగూ అమ్మలకాలను కూడదీసుకుని, భారత రామాయణాలు చదివి వినిపించేది.
చదువుకున్నది తక్కువేనయినా సంస్కారం ఎక్కువనిపించేది నాకు ఆమెను చూసినప్పుడల్లా!
ఆవిడచెప్పిన జీవన సూత్రాలు మా ఆవిడకు మంత్రాల్లా పనిజేసి అందరికీ తలలో నాలుకలాగా
ఉండగలిగేందుకు బాగా సాయపడ్డాయి,కన్నవారింటికష్టసుఖాలు కడుపులో దాచుకోవాలి,మెట్టినింటివారి ఇంటివిషయాలు మెదడు దాటిరాకుండా జాగ్రత్త పడాలి.ఇరుగు పొరుగుతో ఎప్పుడూ పొరపాటునగూడా మన ఇంటివిషయాలు పొక్కకూడదు.ముగ్గురుకోడళ్ళలో ఒకరి సంగతి ఇంకొకరితో
చెప్పడం ఆమే నైజానికి విరుద్ధమని తెలుసు.మమ్మల్ను మరిది పిల్లలని ఎప్పుడూ పిలిచేదికాదు,ఇతరులతో అలా అనేదీకాదు.నాపిల్లలే అన్నట్లు మాట్లాడేది. ఆమె మజ్జిగ చిలికుతుంటే అది రొజూ ఓ గంటకార్యక్రమం చుట్టూ చేరితే వెన్నను ముద్దలుగాజేసి పెట్టేది వేది అన్నం మీద మీగడవేసి తినండిరా పెద్ద చదువులకు వెళిటే బలముండాలిగదా! అనేది. ఆమే తమ్ముడు బావ మరది.పెద్ద చదువులు చదివి ఉనెస్చొ లో ఉద్యోగం చేస్తుండేవాడు.రాయబారిగా ఇండియాకు వస్తాడనుకున్న సమయంలో కాలధర్మం చెందాడు. నందిరాజు వాళ్ళు. డిల్లీ స్కూల్ ఒఫ్ ఎకనమిక్స్ లో 50వదశకంలో యెమ్మే చేసాడు,అటువంటి మాతృ మూర్తులను ఈ రోజుల్లో తలుచుకోగలగడం విశేషంకదా!
==========================================================================