Thursday, March 12, 2015

ఇది పిచ్చి సుబ్బయ్య కధ
--------------------------
అదే ఆంజనేయ స్వామి గుడిలో పూజారిగారికన్నాముందుగా  హాజరయే ఓ వ్యక్తి
పూజారి వెళ్ళింతర్వాత మాత్రమే వెళ్ళే వ్యక్తి,పిచ్చి సుబ్బయ్య.
ఎప్పుడూ అదోలోకంలో మాలోకంగా అమాయకంగా వుండే వాడు.
ప్రతిరోజూ గుడికి హాజరయే అంకిత భక్తుడు సుబ్బయ్యే.

ఓ మూల కూర్చుని భజనరోజుల్లో తాళాలుపట్టుకుని ధ్యానమగ్నుడై
వుండే వాడు.మహాయోగిపుంగవుడిలా కనులు మూసుకుని పరధ్యానంలో వుండే వాడు.అది యేదేవుడి ఊరేగింపయినా ముందు వరసలో దేవుడిపటం పట్టుకుని ఇంకోలోకంలో విహరిస్తూన్న అవధూతలా వుండే వాడు.
బేధమల్లా ,అవధూతల్లా అర్ధ నగ్నంగానో అసలు నగ్నంగానో వుండడీ సుబ్బయ్య. ధోతీ[ముతక ఖద్దరు కట్టుకునిపైన కేవలం ఓ తువ్వాలు మాత్రం వేసుకుని తిరుగుతుండే వాడు. రోజూ 9 గంటలనుండీ
వూరిలో ఎవరొకరింటిలో భజనలు నిరంతరం జరుగుతుండే వి.అక్కడా సుబ్బయ్య హాజరయే వాడు. సుబ్బాయ్య అనారోగ్యం పాలయాడని తెలిసిన రోజు ఒక్కటీ కనబడదు. అది నిజంగా యోగమే గదా మరి.
సంసారం పిల్లలూ వున్నారు. అయినా అదో అయోమయం మనిషిలా
భక్తి పారవస్యన్లో తిరుగుతూ వుంటాడు.వేనుగోపాలస్వామి ఊరేగింపులో ముక్కు స్వామి[గరుత్మంతుడి] ప్రక్కగా తనూ నిలుచుని వుండే వాడు. ఇక పుష్య మాసం వచ్చిందంటే నెలరోజుల పాటు
తెల్ల వారుఝామున నలుగురు భక్తులు తాళాలు వాయించుకుంటూ
ఊరు నాలుగు బజార్లూ క్రమం తప్పకుండా తిరిగే వారు. ఆ భజన సమాజంలో
దేవుడి పటం పట్టుకుని ముందు నడవడానికి సుబ్బాయ్యే ఉండె వాడు..
చలీ గిలీ సుబ్బయ్యకు జాంతానై అన్ని ఋతువుల్లోనూ అదే ఆహార్యమే.
ఎవరన్నా ప్రసాదమిస్తే కళ్లకద్దుకునీమరీ తీసుకునే వాడు.
ప్రతిప్రసాదాన్నీ ఇంటికే పట్టుకెళ్ళేవాడు.ఇంట్లో వాళ్ళూ ఆయన ధోరణిని నిరసించినట్లు ఋజువులేవీ లేవు.
సుబ్బయ్య లేని డేవుడిగుడినేఎ,ఊరేగింపునూ  ఎవ్వరూ ఊహించుకోలేరు.ఇక స్రీరామ నవమి పండగొస్తే అది సుబ్బయ్య పండగే.తాటాకు పందిళ్లు వెసే దగ్గరనుంచీ  పండగయాక గుంజలు పీక్కెళ్ళేదాకా సుబ్బయ్యదే
కుశాలంతా.అలాగే హనుమజ్జయంతినాడు సుబ్బయ్య హాజరయి అన్ని కార్యక్రమాలూ నిర్విఘ్నంగా జరగాలని కోరుకునె వాడిలా
పరమ ఉచ్చిలితో హుషారుగా వుండే వాడు.శ్రీరామ నవమి దాటాక మా వూరి లో వసంతం బండి ఊరేగేది.గంగాళం నిండా రంగునీళ్లతో
నలుగురైదు పిల్లలు బండిమీదకెక్కి పిచికారీ జల్లే వారు.ఎవరింటిదగ్గరయినా ప్రసాదం పళ్ళెంలో తెస్తే సుబ్బయ్యే అందుకుని పూజారిగారికిచ్చి కొబ్బరి కాయ కొట్టాక ప్రసాదం
కొబ్బరి చిప్పతో తిరిగి వాళ్ళకందిచే పని మా సుబ్బయ్యదేసుమా!!
===================================================
ఇకనీ గోంగూర కబుర్లును కట్టబెట్టి అసలు విషయంలో కి రమ్మంటున్న చదువరులకు అండగా నిలబడుతూ ఈ వారం-
------------------------------------------
మరపు రాని మనుషులు
అనినేననగానే వీళ్ళందరూ స్వాతంత్ర సమరయోధులుగానో
దేశభక్తికి అంకితమైన మహా మనీషులుగా ఊహించుకోకండి.

వీళ్ళు మావూరిలో ఐదు దశాబ్దాలక్రింద అందరినోళ్ళలోనూ
నానిన వారుగనుక ఈ ప్రస్తావన సుమండీ!

మొదటగా పిచ్చి ఆదెమ్మ.
----------------------
మాఉ వుహ తెలిసేటప్పటికే ఆవిడయుక్త వయస్సును దాటి 20 -25 యేండ్ల
మధ్యకు ఒచ్చి వుండొచ్చు.
ఉదయాన్నే ఊరు తెల్లవారకముందే స్నానాన్న పాదాలను ముగించుకుని
బజారులోకి సంచారం మొదలు పెట్టేది. ఒకటో రెండోకుక్కలుగూడా
ఆమె వెంట అంగరక్షణ దార్లుగా వెంటబడి వస్తుండేవి.

ఎవ్వరిదగ్గరా చేయి జాచిన పాపానపోలేదు.మూగతనం ఆమే రూపానికి అధికమౌ ఆభరణం. దంతాల వరుస కొంచం పెద్దగా కనిపించేవి.మూతబడని నోరుతోనే ప్రత్యఖమయేది ఎవరైనా
అన్నం పెడతామంటే తినొచ్చానని సైగలు మాత్రం చేసే ది.

పన్శ్డుగకూ పబ్బాలకూ ఎవరయినా చేసుకున్న అప్పచ్చులిస్తే వాటిని
పరికిణీ కుచ్చెళ్ళలో పెట్తుకుని గబ గబా ఇంటికెల్లి ఇచ్చి వచ్చేది.
ఆదెమ్మకో చెల్లి ఉండేది ఆ అమ్మాయి ఇదే తరహా.తల్లిదండ్రులెవరూ
అదిలించినట్లో వాళ్ళను బెదిరించినట్లో కనబడే దికాదు. ఆ చెల్లి తొందరగానే ఈ ప్రపపంచానికి శాశ్వతంగా సెలవు చెప్పి వెళ్ళి పోయింది. ఆఒక్కరోజున మాత్రం  ఆదెమ్మ కళ్ళల్లో దిగులు కన్నీరు
కనబడిండి. అందరినీ ఓ వెకిలి నవ్వుతోనే ఆప్యాయంగా పలకరిస్తూ
వుండేది. విషేషం ఏమిటటంటే ఆదెమ్మ ఊరంతటికీ శుశకునం.

అరక లు  గట్టే టప్పుడూ యే ఇంట్లో  శు భ కార్యం జరిగినా బొట్టు పెట్తిమరీ ఆదెమ్మకు పసుపూ కుంకుమలందించేవారు. ఆదెమ్మ ఏదయినా
పని మీద వెళ్ళే వారికి ఎదురయితే వారి పని నిర్వ్హిఘ్ణంగా కొనసాగుతుందని జనుల ప్రగాఢ విశ్వాసం. ఆదెమ్మ ఆఖరి శ్వ్వస విద్సిచినరోజున ఊరు ఊరంట మెతుకును ముట్టితే వొట్టు. ఆమెను అంతిమ సంస్కారలకు తీసుకెళ్ళినతరువాతనే ఇళ్ళలో పొయ్యి వెలిగింది.
ఈ ప్రయత్నానికి అప్రయత్నంగా అన్నికులాలవారూ సహకరించడం
కొసమెరుపు. పిచ్చాదెమ్మను పెద్ద ముత్తయిదువుగా గౌరవించిన ఊరును ఎలా మరచిపోగలం చెప్పండి.[సశేషం] నిర్విఘ్నంగా
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
ఇక వరమ్మదగ్గరకెల్దాం

-------------------------------
మావూరిముందరతోపులో ఓ వీరాంజనేయస్వామి వారి  గుడివుంది
మావూరు వారంతా శనివారంవస్తే గుడికి వచ్చి ప్రదక్షిణలుజేసి
మనసారా భగవంతుడినిప్రార్ధించుకుని వెళ్ళే వాళ్ళు.
మనసుకు బాధకలిగినా మనసులో మనసులేకపోయినా
మావూరి   దాక్టర్గారి దగ్గరకెళితే మందులతో పాటు
ఆంజనేయస్వామికి 40 ప్రదక్షిణలు ఓ మండలంపాటు చేయమని సెలవిచ్చే వారు.
 వాళ్ళకు ఆ జబ్బు కుదిరి కుదుట పడేది.
అదంతా ఆ భగవంతుడి దయే నని అనుకునే వారు.అది తప్పని ఎవరూ
భేదాభిప్రాయం వ్యక్తం చేసే వారూ కాదు.ఇక అక్కడ యే శుభకార్యం ఇంట్లో జరిగినా అనుకున్నది జరిగినందుకు 5 కొబ్బరికాయలు కొట్టిమొక్కును తీర్చుకునే వారు. శనివారం నాడు
ఆకుపూజలు జరుగుతూ ఉండేవి. భజనలూ అవీ జరుగుతుండే వి.
తొలకరినాడు పొలంపనులు ఆయన దగ్గరనుంచే ప్రారంభమయేవి.

మూడేళ్ళకో నాలుగెళ్ళకో ఆంజనేయస్వామిని అందంగా అలంకరించే వారు రకరకాల రంగులతో డ్రాయింగ్   మాస్టారు  క్రిష్ణారావు. ఆతర్వాత చిన్నసైజు ప్రభలుగట్టి యాదవ యువకులు గులాము జల్లుకుంటూ కోదె గిత్తలను విగ్రహంచుట్టూ ప్రదక్షిణలు జేయించేవారు. ఈమధ్య వాళ్ళే రoగులు
స్వామివారి విగ్రహానికి  వేయడంకూడ కద్దు.
చాలా సంవర్సరాలపాటు పైకప్పుకూడాలేకుండానే వుండేది.[సుమారు 70 యెళ్ళనాడు,తుర్లపాడునుంచి మావూరికి తరలి వచారని మాత్రం తెలుసు.అక్కడ బావిలో విగ్రహం దొరికిందని అన్ని వూళ్ళ వాళ్ళూ
ఎడ్లబండ్లుగట్టుకుని వెల్లారట. మావూరివాళ్ళూ నలుగురితో నారాయణ అనుకోకుండా భిన్నంగా ఉపవాసముండి, భజన బృందంతో
ఆవూరికి వెళ్ళారట. ఎవ్వరు తీద్దామని ప్రయత్నించినా రాని విగ్రహం మావూరి వారి భజనల ప్రభావమో భక్తి తత్పరతలకు మెచ్చో ముఖ్యంగా పెద్ద డాక్టర్ సుబ్బారావుగారూ, మదీయ తండ్రిసుబ్బారావూగారల కృషీ చిన్న డాక్టర్ కృష్ణమూర్తిగారి కృస్సంకల్ప బలం వుందని వూరంతా గొప్పగా చెప్పుకోవడం మాత్రం విన్నము.
ఇక అసలు విషయానికొస్తే ఈ వరమ్మా ఆ అంజనేయ స్వామికి అనుంగు భక్తుతాలు. శనివారం నాడు ఆ స్వామివారు ఆమే వొంటిమీదకొవ్చ్చే
వారు.అది ఆమె భక్తి కావొచ్చు అధునాతన సాంకేతిక విజ్ఞానం వల్ల మానసిక రుగ్మతా కావొచ్చు. ఆరోజుల్లో మాత్రం అందరూ అది ఆమె ఒంటిమీదకు దేవుడు రావడం శుభ సూచకమేనని భావించే వారు. భవిష్య వాణిలా ఎమీ చెప్పిన దాఖలాల్లేవుగాని ఆ కొద్ది నిమిషాలూ[ఒ 15 నిమిషాలు] మన స్వరంతిలో ఉండేదికాదన్నది మాత్రం వాస్తవం. ఆ తర్వాత అరచేతిలో హారతికర్పూరంబిళ్లలువెలిగించుకునేది. అక్కడె వున్న వేపచెట్టు ఆకులు గుప్పెడు దాకా తింటుండెది. ఎవ్వర్రూ వరసతోపిలిస్తే మాత్రం విపరీతంగా కోప్పడేది. "ఎవరురా నీకు అత్త నేనిప్పుడు సిoహాద్రి వరమ్మను కాదురా వెధవా !!" అని కసురుకునేది. మాచిన్నపుడు ఈ సంఘటనలు అనేకం చూసాం గనుక కించిత్తు భయంతో అసంకల్పితంగా వణుకు పుట్టడం గూడా జరిగేది.

=======================================================
మా హైస్కూల్ కధా కమామిషూ------
----------------------------

ఇక పిచ్చి పిచ్చి కధలు వదిలేసి ఇంకో అంశంలోకి వెల్దాముసారూ
అన్న చదువరుల మనోభావాలకు న్యాయంచేద్దాం
మావూరి హైస్కూలు జిల్లా పరిషత్ దే అయినా చుట్టుప్రక్కల
ఉన్న వాటిలో మాకే  శాశ్వత    ఉండడం విశేషం. మేము జేరాక  యెస్లేసి లో జేరాక ఇంకో రెండు రూములు అదనంగా వచ్చి చేరాయి. పునాది కోసం దాదాపు 20 ఆడుగుల పైగా తీసినట్లు తెలుసు.

ఓ పెద్ద బావిలా పై అధికారులు ప్రత్యక్షంగా పరీక్షించడానికి వస్తే పునాదిని తీసి మరీ చూపించారు. పిల్లలు దాదాపు చుట్టుప్రక్కల ఐదారు వూళ్ళనుంచి వచ్చే వారు.ఉదయాన్నే ప్రేయర్

జరిగేది.మానిటర్లు ఆరోజు హాజరయిన విద్యార్ధుల సంఖ్యను చెబితే యెస్పీయల్[స్కూల్ మొత్తానికీ లీడర్ రాసుకుని హ్.ం.గారికి చెప్పేవారు. వారంలో ఒకరోజు  పిల్లలకు వక్తృత్వ పోటీలు జరిగేవి.
ఆ ప్రాతిపదిక చాలామందికి మున్ముందు వేదికలపై అన్ర్గళంగా
ఉపన్యసించే వీలుగలిగిందనే చెప్పుకోవాలి.
కొన్ని రోజుల ఆరోజు వార్తలను వినిపించే వారు.ఆరోజుల్లో మద్రాసునుంచి దిన పత్రికలు వచ్చేవి. నిన్నటి ది ఇవ్వళ ఒచేది.
=============================

హాజరు
ద్దాం