Thursday, March 12, 2015

ఇక వరమ్మదగ్గరకెల్దాం

-------------------------------
మావూరిముందరతోపులో ఓ వీరాంజనేయస్వామి వారి  గుడివుంది
మావూరు వారంతా శనివారంవస్తే గుడికి వచ్చి ప్రదక్షిణలుజేసి
మనసారా భగవంతుడినిప్రార్ధించుకుని వెళ్ళే వాళ్ళు.
మనసుకు బాధకలిగినా మనసులో మనసులేకపోయినా
మావూరి   దాక్టర్గారి దగ్గరకెళితే మందులతో పాటు
ఆంజనేయస్వామికి 40 ప్రదక్షిణలు ఓ మండలంపాటు చేయమని సెలవిచ్చే వారు.
 వాళ్ళకు ఆ జబ్బు కుదిరి కుదుట పడేది.
అదంతా ఆ భగవంతుడి దయే నని అనుకునే వారు.అది తప్పని ఎవరూ
భేదాభిప్రాయం వ్యక్తం చేసే వారూ కాదు.ఇక అక్కడ యే శుభకార్యం ఇంట్లో జరిగినా అనుకున్నది జరిగినందుకు 5 కొబ్బరికాయలు కొట్టిమొక్కును తీర్చుకునే వారు. శనివారం నాడు
ఆకుపూజలు జరుగుతూ ఉండేవి. భజనలూ అవీ జరుగుతుండే వి.
తొలకరినాడు పొలంపనులు ఆయన దగ్గరనుంచే ప్రారంభమయేవి.

మూడేళ్ళకో నాలుగెళ్ళకో ఆంజనేయస్వామిని అందంగా అలంకరించే వారు రకరకాల రంగులతో డ్రాయింగ్   మాస్టారు  క్రిష్ణారావు. ఆతర్వాత చిన్నసైజు ప్రభలుగట్టి యాదవ యువకులు గులాము జల్లుకుంటూ కోదె గిత్తలను విగ్రహంచుట్టూ ప్రదక్షిణలు జేయించేవారు. ఈమధ్య వాళ్ళే రoగులు
స్వామివారి విగ్రహానికి  వేయడంకూడ కద్దు.
చాలా సంవర్సరాలపాటు పైకప్పుకూడాలేకుండానే వుండేది.[సుమారు 70 యెళ్ళనాడు,తుర్లపాడునుంచి మావూరికి తరలి వచారని మాత్రం తెలుసు.అక్కడ బావిలో విగ్రహం దొరికిందని అన్ని వూళ్ళ వాళ్ళూ
ఎడ్లబండ్లుగట్టుకుని వెల్లారట. మావూరివాళ్ళూ నలుగురితో నారాయణ అనుకోకుండా భిన్నంగా ఉపవాసముండి, భజన బృందంతో
ఆవూరికి వెళ్ళారట. ఎవ్వరు తీద్దామని ప్రయత్నించినా రాని విగ్రహం మావూరి వారి భజనల ప్రభావమో భక్తి తత్పరతలకు మెచ్చో ముఖ్యంగా పెద్ద డాక్టర్ సుబ్బారావుగారూ, మదీయ తండ్రిసుబ్బారావూగారల కృషీ చిన్న డాక్టర్ కృష్ణమూర్తిగారి కృస్సంకల్ప బలం వుందని వూరంతా గొప్పగా చెప్పుకోవడం మాత్రం విన్నము.
ఇక అసలు విషయానికొస్తే ఈ వరమ్మా ఆ అంజనేయ స్వామికి అనుంగు భక్తుతాలు. శనివారం నాడు ఆ స్వామివారు ఆమే వొంటిమీదకొవ్చ్చే
వారు.అది ఆమె భక్తి కావొచ్చు అధునాతన సాంకేతిక విజ్ఞానం వల్ల మానసిక రుగ్మతా కావొచ్చు. ఆరోజుల్లో మాత్రం అందరూ అది ఆమె ఒంటిమీదకు దేవుడు రావడం శుభ సూచకమేనని భావించే వారు. భవిష్య వాణిలా ఎమీ చెప్పిన దాఖలాల్లేవుగాని ఆ కొద్ది నిమిషాలూ[ఒ 15 నిమిషాలు] మన స్వరంతిలో ఉండేదికాదన్నది మాత్రం వాస్తవం. ఆ తర్వాత అరచేతిలో హారతికర్పూరంబిళ్లలువెలిగించుకునేది. అక్కడె వున్న వేపచెట్టు ఆకులు గుప్పెడు దాకా తింటుండెది. ఎవ్వర్రూ వరసతోపిలిస్తే మాత్రం విపరీతంగా కోప్పడేది. "ఎవరురా నీకు అత్త నేనిప్పుడు సిoహాద్రి వరమ్మను కాదురా వెధవా !!" అని కసురుకునేది. మాచిన్నపుడు ఈ సంఘటనలు అనేకం చూసాం గనుక కించిత్తు భయంతో అసంకల్పితంగా వణుకు పుట్టడం గూడా జరిగేది.

=======================================================

No comments:

Post a Comment