Thursday, March 12, 2015

ఇకనీ గోంగూర కబుర్లును కట్టబెట్టి అసలు విషయంలో కి రమ్మంటున్న చదువరులకు అండగా నిలబడుతూ ఈ వారం-
------------------------------------------
మరపు రాని మనుషులు
అనినేననగానే వీళ్ళందరూ స్వాతంత్ర సమరయోధులుగానో
దేశభక్తికి అంకితమైన మహా మనీషులుగా ఊహించుకోకండి.

వీళ్ళు మావూరిలో ఐదు దశాబ్దాలక్రింద అందరినోళ్ళలోనూ
నానిన వారుగనుక ఈ ప్రస్తావన సుమండీ!

మొదటగా పిచ్చి ఆదెమ్మ.
----------------------
మాఉ వుహ తెలిసేటప్పటికే ఆవిడయుక్త వయస్సును దాటి 20 -25 యేండ్ల
మధ్యకు ఒచ్చి వుండొచ్చు.
ఉదయాన్నే ఊరు తెల్లవారకముందే స్నానాన్న పాదాలను ముగించుకుని
బజారులోకి సంచారం మొదలు పెట్టేది. ఒకటో రెండోకుక్కలుగూడా
ఆమె వెంట అంగరక్షణ దార్లుగా వెంటబడి వస్తుండేవి.

ఎవ్వరిదగ్గరా చేయి జాచిన పాపానపోలేదు.మూగతనం ఆమే రూపానికి అధికమౌ ఆభరణం. దంతాల వరుస కొంచం పెద్దగా కనిపించేవి.మూతబడని నోరుతోనే ప్రత్యఖమయేది ఎవరైనా
అన్నం పెడతామంటే తినొచ్చానని సైగలు మాత్రం చేసే ది.

పన్శ్డుగకూ పబ్బాలకూ ఎవరయినా చేసుకున్న అప్పచ్చులిస్తే వాటిని
పరికిణీ కుచ్చెళ్ళలో పెట్తుకుని గబ గబా ఇంటికెల్లి ఇచ్చి వచ్చేది.
ఆదెమ్మకో చెల్లి ఉండేది ఆ అమ్మాయి ఇదే తరహా.తల్లిదండ్రులెవరూ
అదిలించినట్లో వాళ్ళను బెదిరించినట్లో కనబడే దికాదు. ఆ చెల్లి తొందరగానే ఈ ప్రపపంచానికి శాశ్వతంగా సెలవు చెప్పి వెళ్ళి పోయింది. ఆఒక్కరోజున మాత్రం  ఆదెమ్మ కళ్ళల్లో దిగులు కన్నీరు
కనబడిండి. అందరినీ ఓ వెకిలి నవ్వుతోనే ఆప్యాయంగా పలకరిస్తూ
వుండేది. విషేషం ఏమిటటంటే ఆదెమ్మ ఊరంతటికీ శుశకునం.

అరక లు  గట్టే టప్పుడూ యే ఇంట్లో  శు భ కార్యం జరిగినా బొట్టు పెట్తిమరీ ఆదెమ్మకు పసుపూ కుంకుమలందించేవారు. ఆదెమ్మ ఏదయినా
పని మీద వెళ్ళే వారికి ఎదురయితే వారి పని నిర్వ్హిఘ్ణంగా కొనసాగుతుందని జనుల ప్రగాఢ విశ్వాసం. ఆదెమ్మ ఆఖరి శ్వ్వస విద్సిచినరోజున ఊరు ఊరంట మెతుకును ముట్టితే వొట్టు. ఆమెను అంతిమ సంస్కారలకు తీసుకెళ్ళినతరువాతనే ఇళ్ళలో పొయ్యి వెలిగింది.
ఈ ప్రయత్నానికి అప్రయత్నంగా అన్నికులాలవారూ సహకరించడం
కొసమెరుపు. పిచ్చాదెమ్మను పెద్ద ముత్తయిదువుగా గౌరవించిన ఊరును ఎలా మరచిపోగలం చెప్పండి.[సశేషం] నిర్విఘ్నంగా
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

No comments:

Post a Comment