Wednesday, June 17, 2015

విప్లవాత్మకమైనభావాలు గలిగి.వివాదాస్పదమైన రచయితగా
విశేష ఖ్యాతినార్జించిన అశేషశేముషీఖని,గుదిపాటి వెంకట చలం. చదువరులనుండి భూషణలు దానికన్న అధికంగా దూషణలనూ గడుసరిగా సమభావంతో స్వీకరించిన ఘటికా వతంసుడూ చలమే.

స్త్ర్ర్ జాతి సముద్ధరణకోసం పురుషుడితో సమానంగా స్త్ర్ర్ని గుర్తించి సమాజం గుర్తించి తదనుగుణంగా గౌరవించాలని సమున్నతంగా ఆశించిన వ్యక్తి శ్రీ చలం.స్త్రీ జతిలోని ఔన్నత్యాన్ని పదె పదే గుర్తుచేస్తూ సమున్నతంగా స్త్రీని శిఖరారోహణం చేయాలని మనసారా భావించి తనరచనలలో
ఉటంకించి త్జ్ర్ప్తి పదిన ఘనాపాఠి.
ఎవరెంతా ఎదురుచెప్ప్పినా ఆక్రోశించినా ,తనరచనలను తన వ్యక్తిగత జీవితాన్ని క్రమానుగుణంగామలచుకున్న విశేషమైన
ప్రజ్ఞాశాలి శ్రీ చలం.ఎందరికో ఆరాధ్యుడిగా నిలవడం ఆయనలోని ప్రత్యేకమైన ప్రతిభకు సోదాహరణం.
1925లో ప్రప్రధమగా వెలువడి ఆతరువాత అసంఖ్యాకమైన మ్య్ద్రణలు నోచుకున్న పుస్తకం--చలం "
స్త్రీ". ఒక నిర్దిష్టమైన దిశగ తనసాహితీ మార్గాన్ని సాగించిన శ్రేయోనిధి.చలం. పుస్తకాన్ని స్త్రీ జాతుఇకి అంకితమిస్తూ

నాకు ఒక్క నిముషం -విశ్రాంతినివ్వక మహాప్రణయ మారుతవేగం అగాధ వియోగ భారంక్రిందనో చీల్చి నలిపి ఊపీఅడనీక నాజీవితాన్ని పాలించే శ్త్రీలోకానికి నివేదితం.
ఈ పుస్తకాన్ని మోహం,పతివ్రత,స్త్రీ నీతి స్రీ సంపాదన బదిచదువులు స్త్రీ స్వేచ్చ ఇలా 38విభాగులా ఈ పుస్తకాన్ని రూపొందించదంజరిగింది.
ఇందులో కుటుంబం సంక్షెమం దృష్ట్యా వెలం వెరిగా అర్రుఇలుజాస్తున్న అమలుజరుపబడుతున్న గర్భ నివృత్తి మార్గాలు-గర్భ స్రావాలూ,బాగ్(ఒగులూ అంటూ కొన్ని అధ్యాయాలను కూదా మనం ఈపుస్తకంలోచూదవచ్చు.
ఈపుస్తకాన్ని ఈనాటికాలలో ఎన్నో నిరసనలు ఎదుర్కొమృటూనే ఎందరో
కొనుగోలుచేయడం ఎన్నెన్నో పునర్ముద్రణలకు నోచుకోవడం ఆస్చర్యాన్ని కలిగిస్తున్నదని చెప్తూ
అంత సీరియస్గానూ విరుద్ధంగానూ రాసిన నాపుస్తకాన్ని ఆప్యాయంగా ప్రజలు చదివి నాకు ఉత్తరాలు రాస్తుమ్నారంటే  తెలుగు ప్రజల మెధోసక్తిమీద జ్ఞాన తృష్ణమీద ఎంతోగౌరవం కలుగవచ్చు.
కానీ నాకొచ్చే ఉత్తరాలు మూడొంతులు గర్భాస్రావానికిమందో,మార్గమోచూపమని ప్రత్యక్షంగానోపరోక్షంగానో నర్మ గర్భంగానో నన్ను అభ్యర్ధించెవె నని విమయాన్ని ప్రకటించారు.

స్త్రీ పురుషానుభవం అమూల్యమనీ ,సెంగారపు విలువల్లో తాను జీఇతాన్నెగాక తక్కిన తన సంబంధమైన జీవితాన్ని సుఖప్రదం చెయాలనే దీక్షవున్న వారికోసమె చ్వ్రాసాను సంటారొకచోట.త్రీ. 

Saturday, June 13, 2015

ఒక ఉన్నత పాఠశాలప్రధానోపాధ్యాయునిశ్రీమతిగా
రకరకాలమనస్తత్వ్వాలను అలవర్చుకున్న పిల్లల తల్లిగా
ఎన్నెన్నోఆటుపోట్లనెదుర్కొన్న ఓఅమృతమూర్తిని గూర్చి ప్రస్తావించుకుని
నెలరోజులయినా కాక ముందే ఆ ఆమ్మనుకలుసుకుని పాదాభివందనం చేయాలని వుందని మనవిచేసాను, ఈ శీర్షికలో--ఆమె సహనానికి సోదాహరణమనీ చెప్పుకున్నాను. ఆత్ల్లిని గుర్చితెలుసుకుందామని
నిన్న ఆమె గారి పెద్దకొదుకు ఓ డాక్టర్ మిత్రుడిని అడిగాను అమ్మ గరిని చూదాక్లనిపిస్తుంది  ఎక్కడున్నారు? ఎలాగున్నారు అని ఉత్కంఠావహంగా--- కానీ వచ్చిన ప్తత్యుత్తరం మాత్రం  ఓ కన్నీటి తుఫానును సృష్టించింది.
ఆమె ఈ సంవత్సరం మొదట్లో జనవరి 21 నాడు పరమపదించారని
తెలిసి మ్రాంపడిపోయాను.అదేరోజు ఆమె ప్రాణంకన్నా మిన్నగా
ప్రేమింఛి అనుభూతుల ఆనందాలను పంచుకున్న భర్త గారి పుట్టిన రోజుట.
ఒక జయంతినాడే ఒక వర్ధంతి--విషాదాశ్రువులతో---
=========================================

Saturday, June 6, 2015

చదువదగిన పుస్తకం
--------------గొపీచంద్ 'యమపాశం'
======================================
సరిగ్గా తొలికధానిక పుట్తిన సంవత్సరంలొనే జన్మించిఉత్తమ కధారచయితగానేగాక
సమాజ జీవితానికి చక్కని దర్పణంలా నవలలు రచించినమంచి ప్రఖ్యాతిని బడసిన వ్యక్తి,
 త్రిపురనేని గొపీచంద్.
అసమ్ర్ధుని జీవయాత్ర ,మెరుపులమరకలు,పండిత పరమేశరశాస్త్రి వీలునామా యమపాశంలాంటి నవలలనందించి తెలుగునవలా ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని అలంకరించిన ప్రముఖ రచయిత శ్రీ గొపీచంద్.

ప్రభుత్వ యంత్రాంగమనేది  ఒక పరమ పద సోపాన పటం,ఆపటంలో ఎక్కడకక్కడ పాములు పడగలు విప్పి కాటేయడానికి సిద్ధమై బుసలు కొడుతూ వుంటాయి.అలా ఆ పాముల పుట్టలో చిక్కుపడిపోయిన వ్యక్తి.రాజమ్మ భర్త నారాయణరావు.అతనే ఈనవలలోని నాయకుడు.మధ్యతరగతి జీవితంలో మనకెదురయే చేదునిజాలని రచయిత మనకు చవి చూపిస్తాడు.

చాలీ చాలనుఇకొంపలో ఏడుగురు పిల్లలతో ఆ పిల్లలను కనీ కనీ ప్రతిసారీ స్వర్గ ద్వారలదాకా వెళ్ళి దివినుంచి భువికి దిగివచ్చిన జీవచ్చవం లాంటి ఇల్లాలు ఆమె.పైమెట్టుగుండా పకి పోవాలని,పై అధికారుల అండదండలకోసం వారి ప్రాపుకోసం అహర్నిశలూ అర్రులుజాచే చిరుద్యోగులకు అసలు సిసలు ప్రతినిధిగా నారాయనరావు మనకు ద్యోతకమవుతాడు.
కొంతమంది మంచం దగ్గర చెప్పులొదిలితే చాలు భార్య గర్భం ధరించడం ఖాయమని పెరల్ బక్ మాటలకు సోదాహరణంగా నారాయణ రావు కనుపిస్తాడు. ఎపటికప్పుడు సంతానన్ని కంకుండా నిరోధించాలని ప్రయత్నించీ విఫల మౌతుంటాడు. మన కధా నాయకుడు.

Monday, June 1, 2015

రాసిన ఒకే ఒక  నవలలద్వారా ప్రముఖ రరచయితలలో అగ్రశ్రేణినందుకుని ఆ స్థానాన్ని అనితరసాధ్యంగా పదికాలాలపాటుష్థిరంగా నిలుపుకున్న నవలాకారుడు
కీ.శే/ శివరాజు వెంకటసుబ్బారావు గా,కాక కేవలం బుచ్చిబాబుగా పేర్వడసిన ప్రముఖుడు.

జీవితంలో నిశితమైన పరిశీలనా,సౌంద ర్యo   కలబోసుకున్న మూర్తిమంతమయిన మనీషి మన బుచ్చిబాబు.
చక్కని మనస్తత్వ పరిశీలనకు విశిష్టమైన విశ్లేషణా విన్నాణ్ణానికి స్ఫురద్రూపమైన కిరణంగా  బుచ్చిబాబు మనకు కళ్ళెదుట సాక్షాత్కరిస్తాడు.

ఒకసారి చదవగానే ఇట్టే అర్ధమవకపోగా మళ్ళీ మళ్ళీ చదువుతున్న కొద్దీ మరీ మరీ చదవాలనిపించే సజీవ పాత్రల రూపకల్పనతో  సూదంటురాయిని బోలిన కధనం ఈ నవలేతివృత్తం ,చదువురులను ఇట్టే  కట్టిపడేసేరూపకల్పన ఇందులోమనం గౌరవించదగిన పరిణామం.

ఇందులో కధానాయకుడనదగిన దయానిధి పాత్ర మనకు విచిత్రంగా కనిపిస్తూ పరిశోధన చేయదగిన విషయ వివేచన గలది.తల్లి మీద దయానిధి అవ్యాజానురాగం.అశేషమైన అనురాగం,అద్వితీయమైన్ ప్రేమ.కానీ తల్లి హీనచరితయని గ్రహించాక తల్లిని ద్వేషించకుండా నిబ్బరించుకోలేకపోతాడు.అయినా ప్రత్యక్షంగా ప్రేమ భావాలను ప్రకటించకుండా

ఉండలేకపోతాడు.  కానీ ఆప్రేమలోని బెరుకుతనాన్ని ఎంతకీ సమన్వయంచేసుకోలేక గిల గిలలాడిపోతూ వుంటాడు.తన తల్లిని తన జీవితకాలంలోఎవరు   ఎద్దేవచేసినా,వాళ్ళపై కసినీ పగనూ ద్వేషాన్ని తగ్గించుకోలేక పోతూ సతమతమై పోతాడు.

జెరెసొప్పా జలపాతాలూ ,హిమాలయా పర్వతాలూ,  సింధు భాగీరధీనదులు వీటికిమల్లే తల్లి ఎప్పుడూ తనదగ్గరే ఉండిపోవాలనుకుంటాడు .తల్లికి ఫిట్స్ వచ్చే జబ్బు వుంది.ఆజబ్బును
తను స్వయంగా నయంచేయాలన్న తలంపుతో పట్టుదలతో దీక్షగా
మెడిసిన్ లోచేరి శ్రద్ధగా చదూతాడు. తన చదువు పూర్తయి ఓకొలిక్కి రాకముందే అమ్మను శాశ్వతంగాకోల్పోతాడు.కృంగిపోతాడు.

తరువాత అనాసక్తి అనడంకన్నా అర్ధాసక్తితోవైద్య వృత్తిని రాయలసీమలో కొనసాగించాలని తీర్మానించుకుంటాడు. వైద్యవృత్తిలోసఫలీకృతుడుకాలేక సతమత మవుతూ వుంటాడు.కట్కపోతాడు.జెరెసొప్పా,నయాగరా,సింద్ఘు,భాగీరధీ నదులవోలె అమ్మగూడా
శాశ్వతత్వాన్ని అంతరించుకుంటుందని అంధవిశ్వాసం కలిగివుంటాడు.
తల్లికి ఫిట్స్ వచ్చే జబ్బు వుండెది.తను స్వయంగా డాక్టరై ఆజబ్బును అతి శీఘ్రంగా నయంచేయాలని భావిస్తాడు.
అతని చదువుపూర్తిగాకముందే అమ్మ దూరమతుంది.తన దృష్టానికి తానే వగచి కృంగిపోతాడు.

ఆతర్వాత అర్ధాసక్తితోనే వైద్య వృత్తిని చేయాలని రాయలసీమ ప్రాంతానికి తరలివెళతాడు.అక్కడా మనసును వృత్తిమీద లగ్నంచేయలేకపోతాడు.సఫలీకృతుడుకాలేక బాధపడతాడు.
దయానిధికి ఆ తర్వాత దొరికిన వజ్రం ద్వారా గని యజమాని అవతారమెత్తుతాడు.కార్మికులతో ఘర్షణ ప్రారంభమవుతుంది.ఆసందర్భంగా వాళ్ళు తన వ్యక్తిత్వాన్నీ,అమ్మ గతాన్ని అవహేళనగా మాట్లాడితే మ్రాంపడిపోతాడు.
ఇందిరను వివాహం చేసుకున్నా ఆమెతో సంసార జీవనాన్ని సజావుగా సాగించలేకపోతాడు.తన తల్లిమీద ఇందిర వ్యతిర్క భావాలు ప్రకటించగా అనుమానిచీ, అవమానించీ ఆమెకు దూరంగా మసలుతాడు.

దయానిఢి జీవితాన్ని సంపూర్ణంగా ప్రభావితంజేయగలిగేలా ప్రవర్తించిన స్త్రీ అమృతం. వరుసకు మరదలు వరుస గావడంతో కొద్దిగా చనువు అధికమయిందనే చెప్పుకోవాలి.ఆమెలోని సహజత్వం,చనువు అతనిని విపరీతంగా కట్టిపడేస్తాయి.



తను మనసారా కోరుకున్న మహిళ కోమలి.కానీ ఆమె దయానిధికి అందకుండా దూరం దూరంగా జరిగిపోతుంటుంది.వేశ్యకూతురయినా సుఖాన్ని మరోకరితో పంచుకోని అనాఘ్రాత పుష్పం కోమలి.

తను కోరుకున్న కోమలి తనను తప్పించుకుంటూ తిరుగుతూండడం,ఇందిరతో తనకు శారీరక  సంబంధ మంటేనే వెగటు పుడుతూండడంతో,అతన్ని పూర్తిగా అమృతానికి చేరువగా చేరుస్తుంది.
"పావనివి  అచ్చం  బావపోలికలే గదా"!అని అమృతం వాళ్ళత్తగారితో అంటుండగానే నిగూఢంగానిలిచిపోతుందని దయానిధి భావించిన రహస్యాన్ని  అత్తగారి ఎదుటనే బట్ట బయలు చేస్తుంది..ఇక అమృతం తనకే పరిమితమైపోతుందని భావిస్తాడు.ఆఆశోహతుడౌతాడు.తన ఊహలకు రూపాన్నివ్వాలన్న   తపనను మాను కుని వాస్తవజగత్తులోకి అడుగుపెడతాడు.దయానిధి.

తనకోసం తన ప్రేమకొసం తనను వెదుక్కుంటూ వచ్చిన కోమలిని చేరదీస్తాడు.జబ్బుతో మరణించిన ఇందిర స్థానంలో తన భార్యగా స్వీకరిస్తాడు.


ఇలా దయానిధి పాత్రచుట్టూమిగతా   పాత్రలు పరిభ్రమిస్తాయి.నవలను చదివినకొద్దీ ఆసాంతం ఏకబిగిన చదివించే ప్రజ్ఞఈ నవల ఇతి వృత్తానికి కలదనుట నిస్సందేహముగా యదార్ధము. చదివిన ప్రతి సారీ కొంగ్రొత్త రుచులనందించే చక్కని చిక్కని కధనం.

ప్రతిపదాన్నీ కవితామయంగా రసోదయం కలిగించేలా బుచ్చిబాబు ఎం తో శ్రమకోర్చి తీర్చిదిద్దిన కధనం.
చక్కని ప్రకృతిపరిశీలకునిగా ముచ్చటైన చిత్రకారునిగా మీదుమిక్కిలి మనస్తత్వ శాస్త్ర విశ్లేషకునిగా ఇతివృత్తాన్ని ఎంపిక చేయడం దగ్గరనుంచి, పాత్రలను ప్రతిభాసమన్వితంగా నడిపించేతీరులోనూ ఎన్నో కొత్తదారులను తొక్కిన ఘనత కూడా బుచ్చిబాబుదే.అది వేనోళ్ళా  ప్రశంసార్హం.
తాను సృష్టించుకున్న సమాజంలో మానవుడు ఎలా ఉన్నాడొ విశ్లెషిమడమే నవలాకారుని ప్రధానమైన ఎత్తుగడ.
బాహ్యజగత్తులో ఎదురయే వ్యతిరేక శక్తులతో ఎలాపోరాడాలో ఎలా సమాధానపడాలో  తన అతరంగ జగత్తులో జరిగే గట్టి ఘర్షణను ఎలా సముదాయించాలో సంగ్రంగా మనకు సూచన ప్రాయంగాందించిన మానసిక విశ్ళేషాణాత్మక నవల ఇది.అని బుచ్చిబాబు ఆల్దుక్ష్ హక్సిలీ గురించి రాస్తూ[భారతి-జనవరి-1964 సంచికలో అన్న మాటలు అతని ఈ నవలకు చక్కగా పొదవిన రత్నాల్లా సరిపోతాయి.

తన శక్తినంతా కూడగట్టుకుని ఎంతో మానసిక బలాన్ని ఖర్చుజేస్తూ ఎన్నో సంవత్సరాలు,సాంకేతిక విషయాలను అద్గ్యయనం చేసి వెలువడిన ఈ నవల చదువరి ఏకాగ్రతతో మనసు పెట్తి చదివితేగాని అంతుబట్టని ఒంటబట్టించుకోలేని నవల ఇది. అందుకేనేమో ఇంతగా శ్రమించి రాసిన నవల కావడంతో మరో నవల సృజించకుండానే బహుధా విభిన్న వర్గాల ద్వారా ప్రశంసలనందుకున్న అశఅశేష శేముషీ ఖని , బుచ్చిబాబు అనడంలో సందేహానికి తావులేదు.